జీవితంలో ఏం మిగిలింది కనుక ’చీకటి‘ తప్ప..! అంతా భ్రమ అని తేలినప్పుడు, మనదైనదంటూ ఏమి మిగలనప్పుడు ’అదిగో కాలుతున్న శరీరం..శ్మశానం..ఎగిసిపడే మంటలు..ఆకృతిపోయి, ఆకారం నశించి బూడిద మాత్రమే మిగిలే పచ్చి వాస్తవం‘. ఆస్తులు ఎటూ తిరిగి వెంటరావు..కానీ, ఈ ’శ్రద్ధ‘లేమైపోతాయ్..అమ్మానాన్న, అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, ఆలు బిడ్డలు..అందరూ ఏమైపోతారు..! కలివిడితనం నుంచీ, కలిసుండే లోకం నుంచి .. అలా ఒంటరిగా ప్రయాణించటం బాధాకరమే అయినా పచ్చి వాస్తవం కదా..! అందుకే వెలుగు అబద్దం.మట్టిలో పుట్టి మట్టిలో కలిసే ’చీకటి‘ మాత్రమే సార్వజనీన వాస్తవం
Wednesday, January 7, 2015
Subscribe to:
Posts (Atom)